వేముల రమేష్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయురాలుకు ఘన సన్మానం
హుజురాబాద్ /సెప్టెంబర్ 08 (మా అక్షరం): మండలాల్లోని శాలపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల లో ఉత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన సందర్భంగా సోమవారం శాలపల్లి పద్మశాలి గ్రామ శాఖ అధ్యక్షులు వేముల రమేష్ ఆధ్వర్యంలో హెచ్ఎం శారద కు మేమెంటో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ ఆజాది ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ… పిల్లలు ఇష్టపడి చదివి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు జడల సదాశివ, ప్రధాన కార్యదర్శి ముషం సత్యం కోశాధికారి మెరుగు నగేష్, సహాయ కార్యదర్శి దుస శ్రీనివాస్, గుత్తికొండ అంజయ్య, ఎంపిటిసి తాజా మాజీ గద్దెల లలిత, ప్రాథమిక పాఠశాల చైర్మన్ మ్యాడ దశ్రీలత బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బింగి రాణి ,ఎడ్ల రిషిత, కొడిగోటి రాణి, దేవోజు స్వరాజ్యం, కేత మండి అనిత, హుజురాబాద్ సొసైటీ సంఘం కోశాధికారి గుండేటి దేవయ్య, తదితరులు పాల్గొన్నారు











