+91 99635 77856

ప్రాణాన్ని కాపాడిన యువకుడు

-ప్రాణాన్ని కాపాడిన యువకుడు…

హుజురాబాద్/ సెప్టెంబర్ 07 (మా అక్షరం): ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడేందుకు హుజురాబాద్ లోని ఒక యువకుడు ముందుకు వచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని మడద గ్రామానికి చెందిన బండారి దివ్య అనే యువతికి డెంగీ జ్వరంతో రక్తకణాలు పదివేలకు పడిపోయాయి. డాక్టర్లు వెంటనే ఆమెకు ప్లేట్లెట్స్ ఎక్కించాలని బంధువులకు సూచించారు. దివ్యకు ఏ పాజిటివ్ డోనర్ అవసరం కాగా దివ్య బంధువులు సబ్బని వెంకట్ ఏర్పాటు చేసిన ఒక బ్లడ్ గ్రూపులో వివరాలు పోస్ట్ చేయగా హుజురాబాద్ కు చెందిన ఉమ్మడి రాము అనే యువకుడు స్పందించాడు. వెంటనే వాట్సప్ పోస్ట్ లో ఉన్న నెంబర్కు ఫోన్ చేసి కరీంనగర్ లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి వెళ్లి ప్లేట్లెట్స్ డొనేట్ చేశాడు. ప్రమాదంలో ఉన్న ఆ యువతకి డోనర్ రూపంలో రాము దేవుడయ్యాడు. రాముతో పాటు బ్లడ్ గ్రూప్ ఏర్పాటు చేసిన సబ్బని వెంకట్ కు దివ్య కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !