-వారాహి ఫౌండేషన్ చైర్మన్ ఆర్థిక సహాయం..
-దాతలకు కృతజ్ఞతలు…
హుజురాబాద్/ సెప్టెంబర్ 10:(మా అక్షరం):
మూత్రనాళ సమస్యలతో ఇబ్బంది పడుతున్న హుజూరాబాద్ పట్టణానికి చెందిన చెనుమల్ల ప్రసాద్ కు దాతలు ఆర్థిక సహాయం బుధవారం అందించారు. పట్టణంలో ఎల్ఐసి లో చిరుద్యోగిగా పనిచేస్తున్న ప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఆయన బాధ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న వారాహి ఫౌండేషన్ చైర్మన్ కూడికల భాస్కర్ స్పందించి ఆయన అనారోగ్య దీన పరిస్థితిని గమనించి వారికి 25 కిలోల రైస్ బ్యాగును అందించారు. ప్రసాద్ ను ఆదుకోవడానికి సహృదయులైన వారు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వారాహి డైరెక్టర్ చిలుకమారి శ్రీనివాస్, డైరెక్టర్ జునుకుల లక్ష్మణరావు పటేల్, బీసీ ఆజాద్ ఫెడరేషన్ హుజరాబాద్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా తన సమస్య అనారోగ్య సమస్యలకు బాసటగా నిలిచిన దాతలకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.











