+91 99635 77856

హనుమాన్ దేవస్థానానికి 20 లక్షల మంజూరు

– ఏళ్లుగా నోచుకోని దేవాలయాలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహర్దశ…
– కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ సభ్యులు…
హుజురాబాద్ /సెప్టెంబర్ 23 (మా అక్షరం): ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని దేవాలయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం,హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రథంలో ముందుకు వెళ్తున్నాయని హనుమాన్ దేవస్థాన చైర్మెన్ కొలిపాక శంకర్ అన్నారు.మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేవస్థాన అభివృద్ధికి,కమిటీ హాల్ కు 20 లక్షల ఎస్డిఫ్ నిధులు మంజూరు చేశారని నిధులు మంజూరు చేపించడానికి కృషి చేసిన ప్రణవ్ కు,జిల్లా మంత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.హుజూరాబాద్ నడిబొడ్డున ఉన్న హనుమాన్ దేవస్థానాన్నీ ఏళ్లుగా పాలించిన పాలకులు పట్టించుకునే నాధుడు కరువయ్యాడని ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం రోజున ఇచ్చిన మాట ప్రకారం ప్రణవ్ నిధులు కేటాయించారని,హిందుత్వం అని చెప్పే ఈ ప్రాంత ఎంపీ ఆలయాలకు ఏం నిధులు కేటాయించారో తెలపాలని కోరారు.ప్రజా ప్రభుత్వంలో గుళ్లు,బడులు అభివృద్ధి జరుగుతున్నాయని ఇది శుభపరిణామమని అన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో,కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ పట్టణ,మండల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాలు,సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !