-పోతిరెడ్డిపేటలో పోచమ్మ తల్లి పంచమ వార్షికోత్సవం…
-భక్తుల నుంచి విరాళాల స్వీకరణ…
హుజురాబాద్/ అక్టోబర్ 10( మా అక్షరం): మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో పోచమ్మ తల్లి పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు శుక్రవారం అందజేశారు.మాజీ సర్పంచ్ తాటికొండ పుల్లాచారి , ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో మంకమ్మపల్లి గ్రామానికి చెందిన బాలసాని తేజశ్రీ – రజనీకాంత్ దంపతులు రూ.50,016 విరాళంగా, సంగెం రాజేందర్ – శృతి (జాహ్నవి గ్యాస్ ఏజెన్సీస్) దంపతులు రూ.10,016 విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుల్లాచారి మాట్లాడుతూ…“పోతిరెడ్డిపేట పోచమ్మ తల్లి మహిమగల దేవత. ఆమెను నమ్మి కోరిన కోరికలు నెరవేరుతాయి. భక్తులు తమ వంతు సహాయంగా ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు అందించడం సంతోషకరమైన విషయం” అని తెలిపారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై, ప్రత్యేక పూజలు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.











