+91 99635 77856

బీసీ రిజర్వేషన్ బంద్ కు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు..

-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
హుజురాబాద్/ అక్టోబర్ 17 (మా అక్షరం): రేపు బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు హుజూరాబాద్ బి ఆర్ఎస్ పార్టీ తరుపున మద్దతు తెలుపుతున్నామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లేరేషన్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం అమలు చేయలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీసీలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు.ఎన్నికలలో కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టో పేరుతో బీసీలను మోసం చేసిందని, బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్రస్థాయిలో బీసీ బందుకు మద్దతు తెలుపుతూ, న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం ఇంటింటి కులగణన సర్వేలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గవర్నర్,రాష్ట్రపతి దగ్గరికి పంపిన బీసీ బిల్లులను వెంటనే ఆమోదించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.బీసీల పట్ల నిజమైన ప్రేమ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !