హుజురాబాద్/ అక్టోబర్ 25 (మా అక్షరం): భీమదేవరపల్లి మండలంలోని వంగరలోని పివి రంగారావు గురుకులంలో శుక్రవారం పదవ తరగతి చదువుతున్న హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా శనివారం రోజున రాంపూర్ గ్రామానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్..అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని,ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని,దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Post Views: 469











