హుజూరాబాద్/నవంబర్ 01(మా అక్షరం):పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం “బేటీ బచావో – బేటీ పడావో” మరియు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ డా. అశ్విని తానాజీ వాకడే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనూ స్త్రీ జననాల శాతం తక్కువగా ఉందని, ప్రతి ఆడపిల్ల పుట్టడం మహాలక్ష్మి పుట్టినట్టేనని సమాజంలో అవగాహన పెంచాలని సూచించారు. ఆడపిల్లల జననాలను ప్రోత్సహిస్తూ లింగభేదం లేకుండా సమానత్వం పాటించాల్సిన అవసరాన్ని ఉందన్నారు.డిఎంహెచ్వో డా. వెంకటరమణ మాట్లాడుతూ..పిసిపిఎన్డిటి చట్టంను జిల్లాల్లో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. లింగ నిర్ధారణ పేరుతో స్కానింగ్ సెంటర్లల లింగ నిర్ధారణ ఆడశిశువును అబార్షన్కు గురిచేయడం వంటి చర్యలకు కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోడిప్యూటీ డిఎంహెచ్వో డా. చందు, అధికారి డా. సనాజేవారియా,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డా. ఉమాశ్రీ, డా. మధుకర్, తులసీదాస్, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











