+91 99635 77856

బీసీ బిడ్డ మృతి బాధాకరం

-బీసీ బిడ్డ మృతి బాధాకరం…

-బీసీ ఆజాదీ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్….

హుజురాబాద్/ డిసెంబర్05(మా అక్షరం): బీసీలపై పెరుగుతున్న అరాచకాలు, అణచివేతలు, ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని బీసీ ఆజాదీ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ అన్నారు. నల్గొండ సంఘటన మరువక ముందే, గురువారం హైదరాబాద్ క్యూ న్యూస్ కార్యాలయం ఎదుట సాయి ఈశ్వర చారి ఆత్మహత్యాయత్నం చేసి ఆపై మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీలపట్ల చిత్తశుద్ధి లేదు. అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్నారు. ఈ విధానాలే అణచివేతలకు కారణం అని మండిపడ్డారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలను ఘోరంగా మోసం చేశారని ఆరోపిస్తూ, ఇకనైనా బీసీలు ఐక్యంగా పోరాటం చేసి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.ఎవరూ ఆత్మహత్యలు చేయకండి. ధైర్యంగా నిలబడితేనే రిజర్వేషన్లు, న్యాయం సాధించగలం” అని ఆయన అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !