హుజురాబాద్/డిసెంబర్ 14( మా అక్షరం): మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు కాశిరెడ్డి శంకర్ రెడ్డి (47) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఇంటి వద్ద అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.ఎప్పుడూ అందరితో కలివిడిగా మెలిగే శంకర్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే రాంపూర్ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు
Post Views: 338











