–ఘనంగా దుర్గా ప్రసాద్ జన్మదిన వేడుకలు…
-హాజరైన ఐజేయూ, టీయూడబ్ల్యూజేే నాయకులు…
వరంగల్ /డిసెంబర్ 26 (మా అక్షరం): టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గా ప్రసాద్ 47వ జన్మదిన వేడుకలను వరంగల్ లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. హంటర్ రోడ్ శ్రీసాయి కాలనీలోని పిఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు టీయూడబ్ల్యూజేే, ఐజేయూ వరంగల్, హనుమకొండ జిల్లాల నాయకులు, జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు దుర్గా ప్రసాద్ కు పూలబొకే లు అందించి గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేే రాష్ట్ర హౌసింగ్ వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గడ్డం కేశవ మూర్తి, పిన్నా శివకుమార్, టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, వరంగల్ జిల్లా అద్యక్షుడు రామ్ చందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. వేణుమాధవ్, కంకనాల సంతోష్, తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్, రెండు జిల్లాల నాయకులు నల్లాల బుచ్చిరెడ్డి,కోదాటి గోపి, మహేష్, పి. విష్ణు వర్ధన్, నయీం, జన్ను స్వామి, బుదారపు శ్రీనివాస్, భాస్కర్, రాజేంద్ర ప్రసాద్, సతీష్, జనార్ధన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.











