-డ్రోన్తో వరి విత్తనం — జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ప్రయోగం…
హుజురాబాద్/డిసెంబర్ 27 (మా అక్షరం):కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ఆధ్వర్యంలో శనివారం పోతిరెడ్డిపేట, సిర్సపల్లి గ్రామాలలో డ్రోన్ సాయంతో వరి విత్తడం పై ప్రయోగాత్మక క్షేత్ర పరిశీలన నిర్వహించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగ శాస్త్రవేత్త జె. విజయ్ మాట్లాడారు…డ్రోన్ ద్వారా నేరుగా వరి విత్తే విధానాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మారుత్ డ్రోన్ సంస్థతో కలిసి రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు.కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అనూష, పోతిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ ఎం. సుమలత సురేందర్, రైతులు ఎం. చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
.











