+91 99635 77856

నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

హుజురాబాద్ /జనవరి 08 (మా అక్షరం): మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు,ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కూరపాటి హాస్పిటల్స్ అధినేతలు డా. కూరపాటి రమేష్, డా. కూరపాటి రాధికలు ఈ అభినందన సభను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డా. కూరపాటి రమేష్ మాట్లాడుతూ… గ్రామాల సుస్థిర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా రంగం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తరించేందుకు కూరపాటి ఫౌండేషన్, కూరపాటి హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !