+91 99635 77856

ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ

హుజురాబాద్/జనవరి 08 (మా అక్షరం):ప్రజా ప్రతిభ క్యాలెండర్ హుజురాబాద్ ఇప్పకాయల సాగర్ ఆర్.సి రిపోర్టర్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ ప్రజా ప్రతిభ క్యాలెండర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పత్రికా విలేకరులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వము ప్రజా శ్రేయస్సు కొరకు పని చేయునట్లుగా చూడవలసిన బాధ్యత విలేకరులపైన ఉందని అదే విధంగా ప్రజలను కూడా ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ, సమాజంలో ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. ప్రభుత్వానికి నాలుగవ మూల స్తంభమైన పత్రికలు పారదర్శకంగా పనిచేస్తూ ప్రభుత్వానికి సమాజానికి ఆదర్శంగా ఉంటూ ఉన్నత మైన సేవలను ఎల్లప్పుడూ అందించడంలో ప్రజా ప్రతిభ పత్రిక కూడా ముందు బాగాన ఉంటూ పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆకాంక్షించినారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్, మాజీ సర్పంచ్ రామ్ శంకర్ గౌడ్, పూలే కమిటీ అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్స్ కె.నరసింహారెడ్డి, యాదగిరి నాయక్, కన్నెబోయిన తిరుపతి, తాటిపాముల కనుకయ్య, బొంగోని వెంకటయ్య, తాత సమ్మయ్య, కన్నెబోయిన సమ్మయ్య, మాచర్ల నరేష్, తాళ్ల పెళ్లి రాజేష్, సందమల్ల బాబు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !