+91 99635 77856

విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించిన ఇండస్ట్రియల్ టూర్

హుజురాబాద్ /జనవరి 08(మా అక్షరం):పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీ, బి.కాం (సీఏ) మొదటి సంవత్సరం విద్యార్థులు తమ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా గురువారం ముల్కనూర్ మహిళా కోఆపరేటివ్ పాల డైరీను సందర్శించారు.ఈ సందర్శనలో పాల సేకరణ విధానం, శుద్ధి ప్రక్రియ, ప్యాకింగ్, సరఫరా వ్యవస్థలతో పాటు వాటికి అయ్యే ఖర్చులు, ఆదాయాలపై విద్యార్థులు అవగాహన పొందారు.ఇటువంటి ఇండస్ట్రియల్ టూర్ల వల్ల విద్యార్థులు తరగతి గదుల్లో పుస్తకాల ద్వారా నేర్చుకున్న విషయాలను ప్రాయోగికంగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కొలిపాక రమేష్, సంపత్ తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !