-ట్రాఫిక్ చట్టాలు ,రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన…
హుజురాబాద్ / జనవరి 09(మా అక్షరం): పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ చట్టాలు, రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై న్యాయమూర్తి పి.బి. కిరణ్ కుమార్ శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వల్ల జరిగే ప్రమాదాలు, మాదక ద్రవ్యాల వైపు విద్యార్థులు ఎలా ఆకర్షితులు అవుతున్నారో, వాటి కారణంగా వారి బంగారు భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో స్పష్టంగా వివరించారు. ట్రాఫిక్ చట్టాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టాలను ఉల్లంఘించిన వారికి ఎదురయ్యే కఠిన శిక్షల గురించి కూడా అవగాహన కల్పించారు.
Post Views: 51











