హుజురాబాద్ / జనవరి 10 (మా అక్షరం):పట్టణంలోని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన వన్నాల శివాజీకి శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్నలు హాజరై శివాజీని సన్మానించారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ…వన్నాల శివాజీ ఉప సర్పంచ్గా మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలకు సకాలంలో సేవలు అందిస్తూ ప్రజల ఆదరణను మరింతగా పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వేముల అశోక్ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ ఏఎంసి డైరెక్టర్, మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి నరసింహా రెడ్డి, బండారి సదానందం, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్,న పూలే కమిటీ అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, వడ్లకొండ, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గరవేణి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.











