-సమ్మక్క–సారక్క జాతరకు మంత్రి కొండా సురేఖను ఆహ్వానించిన ప్రణవ్….
హుజురాబాద్ / జనవరి 13(మా అక్షరం):రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్లోని ఆమె నివాసంలో మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సమ్మక్క–సారక్క జాతర కమిటీల తరఫున ప్రణవ్ కలిసి, జాతర నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరగనున్న సమ్మక్క–సారక్క జాతరకు హాజరవ్వాలని మంత్రిని ఆయన కోరారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందిస్తూ, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలని సూచించారు. జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు
Post Views: 142











