-గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, పండ్ల పంపిణీ…
-హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం…
హుజురాబాద్ / జనవరి 14 (మా అక్షరం):ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో బుధవారం బ్రెడ్ ,పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ వన్నాల శివాజీ ని అభినందించారు.ఈ సేవా కార్యక్రమంలో హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్నతో పాటు రంగాపూర్ ఉప సర్పంచ్ బండి నరేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, వడ్లకొండ కిరణ్, గండికోట సంపత్, శేఖర్ ఎండి బాబర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 219











