-సీపీ గౌస్ ఆలం సందర్శన…
– మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియపై పరిశీలన…
హుజురాబాద్/ జనవరి 28(మా అక్షరం):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు,పోలీస్ బందోబస్తు,శాంతిభద్రతల నిర్వహణపై అధికారులతో సీపీ సమీక్ష నిర్వహించారు.నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్,ఏసిపి వి.మాధవి,పట్టణ సిఐ టి. కరుణాకర్,ఎస్సై యూనస్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 283











