ప్రచారంలో దూసుకుపోతున్న తలకొక్కుల శ్యామల హరిప్రసాద్
హుజురాబాద్ / జనవరి 31 (మా అక్షరం): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార హోరు ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం 22వ వార్డు నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల హరిప్రసాద్ గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ఓటర్లను నేరుగా కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా 22వ వార్డులో కోతుల బెడద, మురికి కాలువలు, ఇతర మౌలిక వసతుల సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.తనకు అవకాశం కల్పిస్తే వార్డులోని అన్ని సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Post Views: 576











