-బీజేపీ పార్టీకి బిగ్ షాక్..
– కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ సీనియర్ నాయకుడు భాషవేణి భాస్కర్ యాదవ్..
హుజురాబాద్/ ఫిబ్రవరి 05 (మా అక్షరం): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం రోజు రోజుకు పెరుగుతుంది.తాజాగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు భాషవేణి భాస్కర్ యాదవ్,అతని అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ ఇంచార్జి.అనంతరం నూతనంగా చేరిన వారు మాట్లాడుతూ 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దే అని,బీజేపీ బీ ఆర్ ఎస్ చీకటి ఒప్పందం జరిగిన ప్రజలు మార్పుకు శ్రీకారం చుడతారని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 474











