-హుజురాబాద్ మునిసిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని శ్రీరామ హాస్పిటల్ సందర్శన…
హుజురాబాద్/ ఫిబ్రవరి28(మా అక్షరం): పట్టణంలోని మునిసిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని శనివారం తొలిసారిగా శ్రీరామ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకర్ మోడెపు ఆధ్వర్యంలో చైర్మన్కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవలను చైర్మన్ పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి అభినందనలు తెలిపారు.పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ, మునిసిపాలిటీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజ్మెంట్ సభ్యులు నంబి భరణి కుమార్, ముస్కె శ్రీనివాస్ నర్సులు తదితరులు
Post Views: 466













