+91 99635 77856

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూం ప్రారంభం

-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూం ప్రారంభం…
హుజురాబాద్ /మార్చి 14 (మా అక్షరం):పట్టణంలో మాచర్ల రాజు ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఓడితల ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా ఇంధనం ఆదా కావడంతో పాటు పర్యావరణానికి ముప్పు తగ్గుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, రాజు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకుడు చందమల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !