+91 99635 77856

ఎస్బిఐ లైఫ్ లో ముందస్తు ఉగాది వేడుకలు

హుజురాబాద్/మార్చి18 (మా అక్షరం): పట్టణంలోని ఎస్బిఐ లైఫ్ కార్యాలయంలో బుధవారం ముందస్తు ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఎస్బిఐ లైఫ్ హుజురాబాద్ డిఎస్ఎమ్ కొత్తపల్లి పైడయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని, భక్షాలను యూనిట్ మేనేజర్లకు లైఫ్ మిత్రలకు, సిబ్బందికి అందజేశారు.ఈ సందర్భంగా ఉత్తమంగా విధులు నిర్వహించిన వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం డిఎస్ ఎం పాడే మాట్లాడుతూ… ఎస్బిఐ లైఫ్ సంస్థ ప్రారంభమై ఈ ఏడాదికి 25 సంవత్సరాలు నిండుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందిస్తుంది అన్నారు. లబ్ధిదారులకు పాలసీ ఫలితాలు అందించడంలో ఇతర సంస్థల కన్నా ముందుందని అన్నారు. ప్రజల మద్దతుతో ఎస్బిఐ లైఫ్ మరింత ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ లైఫ్ ట్రైనర్ కృష్ణవేణి , ఉద్యోగులు నాగరాజు, మహేందర్ పరుశురాం దుర్గా శ్రీ మహాలక్ష్మి రాజేష్ యూనిట్ మేనేజర్లు రమణాచారి విష్ణు సాయికిరణ్ నాగేశ్వర్ రమేష్ బాబు రాజేష్ సురేష్ , మల్లయ్య,సంపత్ కుమార్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !