హుజురాబాద్/ మార్చి 22 (మా అక్షరం): పట్టణ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్కు చెందిన పల్లె రవి అనే గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి తీవ్రంగా గాయపడ్డాడు.రోజువారీ పనిలో భాగంగా తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తున్న సమయంలో, చెట్టు పై నుంచి దిగుతుండగా జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.అక్కడే ఉన్న సహచర గీతా కార్మికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Post Views: 699













