హుజురాబాద్/ మార్చి 27 (మా అక్షరం):శ్రీరామనవమి పండుగ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాల్లో ఆమె హాజరై భక్తులతో కలిసి శ్రీరాముడికి సేవలు అందించారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా పట్టణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
Post Views: 37












