హుజురాబాద్ /ఏప్రిల్04 (మా అక్షరం): ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రగ్బీ జాతీయ స్థాయి పోటీలకు హుజురాబాద్ పట్టణ శివారులోని కేసిఆర్ గర్ల్స్ ఎంజేపీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి.అంకిత ఎంపికైంది.ఈ నెల 5వ తేదీన ఒడిశా రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి రగ్బీ పోటీలలో ఆమె పాల్గొననుంది.ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి శారద,ఏటీపీ పోగు రజిత, పీఈటీ చిరుత కవితలు అంకితను అభినందించి,మరింత ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.
Post Views: 103













