+91 99635 77856

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

– దేశానికి విశేష సేవలు అందించారు.వారి ఆలోచనలు దేశ అభివృద్ధికి పునాదులు అయ్యాయి…
– జయంతి వేడుకల్లో పాల్గొన్న హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్…

హుజురాబాద్/ ఏప్రిల్ 05 (మా అక్షరం): దేశంలో సామాజిక న్యాయం అందరికి అందేలా కొట్లాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని,దేశ రక్షణ,కార్మిక,వ్యవసాయ రంగంలో,తొలి ఉప ప్రధానిగా విశిష్ట సేవలు అందించారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం నాడు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ… స్వాతంత్ర్యం అనంతరం మన స్వయంపాలనలో దేశ ప్రగతిలో పాలుపంచుకున్నారనీ,వారి ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం వారి బాటలో నడుస్తూ రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,నిర్వాహకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !