-ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డులు…
-హుజురాబాద్ 108 సిబ్బందికి గౌరవం…
హుజురాబాద్ /ఏప్రిల్ 07 (మా అక్షరం): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రూరల్ 108 సిబ్బందికి గౌరవం దక్కింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఈఎంటీగా రొంటాల సురేష్ కుమార్, ఉత్తమ పైలట్గా సుంకరి అశోక్ రెడ్డి ఎంపికయ్యారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ, ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టియానో, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత, హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.అత్యవసర వైద్య సేవల్లో విశేష కృషి చేసినందుకు వీరిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఈ సిబ్బంది రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమానాగేందర్, జిల్లా ఈఎంఈ సయ్యద్ ఇమ్రాన్ అభినందనలు తెలిపారు.













