+91 99635 77856

దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలి

కరీంనగర్/ ఏప్రిల్ 08 (మా అక్షరం): మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా కొనసాగిన దామోదర్ రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. తీగల బ్రిడ్జి సర్కిల్లో గురువారం10 గంటలకు జరిగే ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !