+91 99635 77856

ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోం

– బీజేపీ అవంభిస్తున్న విధానాలను ఎండగడుతాం..

– రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ పై బూత్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం…

హుజురాబాద్/ ఏప్రిల్ 11 (మా అక్షరం): దేశంలో బీజేపీ పార్టీ అవలంభిస్తున్న విధానాలను ఎండగడుతూ ఎస్ఐఆర్ పేరుతో అక్రమ చొరబాటుదారుల పేరు చెప్పి పేద,మధ్య తరగతి ఓటర్లను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆరోపించారు.శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి పరిశీలకులుగా రాష్ట్ర పిసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఆడమ్ రాజ్ డెక్కపాటి,కాశపాక రాజేష్ లతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ… దేశంలో ఎస్ఐఆర్ విధానం వల్ల పన్నెండు రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం జరిగిందని,ఇలాంటి తప్పులు తెలంగాణలో జరగకుండా ఉండడానికి నియోజకవర్గ పరిధిలో ప్రతి బూత్ కి బూత్ లెవల్ కమిట్ మెంబర్ లను రాష్ట్ర పిసీసీ కి అందిస్తున్నామని,దీనిపై మొన్నటి ఎలక్షన్ లో దొర్లిన తప్పులను ఇప్పుడు దొర్లకుండా ఈ కమిటీ చూసుకుంటుందని తెలిపారు.రాష్ట్ర పిసీసీ తో పాటు డిసిసి లకు కూడా ఈ సమాచారం వద్ద ఉంటుందని,ఏదైనా ఓటుహక్కు విషయంలో సమస్య ఏర్పడినప్పుడు పరిష్కారానికి ఈ కమిటీ చొరవ చూస్తుందని,బీహార్ రాష్ట్రంలో అక్రమ చొరబాటు దారుల పేర్లతో అనేక మంది మైనారిటీ,బీసీ,ఎస్సీ ఓట్లను తొలగించారని,దీనిపై రాహుల్ గాంధీ వివరంగా ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించారని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,హుజూరాబాద్ పట్టణ,మండల అధ్యక్షులు,మహిళా నాయకురాల్లు,సీనియర్ నాయకురాలు,యూత్ కాంగ్రెస్,సోషల్ మీడియా నాయకులు,మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !