హుజురాబాద్ /ఏప్రిల్ 29 (మా అక్షరం): పదో తరగతి పరీక్షా ఫలితాలలో టెట్రాహెడ్రన్ స్కూల్కు చెందిన విద్యార్థిని A సహస్ర 587 మార్కులు సాధించి మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ముచ్చ నారాయణ్ రెడ్డి, డైరెక్టర్లు తిప్పర్తి రమణ రెడ్డి, కోరెం సంజీవరెడ్డి, కేతిరెడ్డి సంపత్ రెడ్డి, మాడ రాజిరెడ్డి, సుంకిశాల సంతోష్ రావు, అడ్వైసర్ కడవెరుగు సత్యనారాయణ, ప్రిన్సిపాల్ నరేష్, ఉపాధ్యాయ బృందం , విద్యార్థిని తల్లిదండ్రులు ఆమెను అభినందించారు.విద్యార్థిని సాధించిన ఈ విజయం పాఠశాలకు గౌరవం తీసుకువచ్చిందని వారు తెలిపారు.
Post Views: 169













