+91 99635 77856

వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తరలింపుపై మంత్రి శ్రీధర్ బాబు ను కలిసిన వొడితల ప్రణవ్,జేఏసీ నాయకులు

– మంత్రికి వినతిపత్రం అందజేసిన నాయకులు.
– సానుకూలంగా స్పందించిన …

-ముఖ్యమంత్రితో చర్చించి తరలింపునకు సహకరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి…

హుజురాబాద్/ మే 02 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తరలింపునకు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు ను కోరారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్,జేఏసీ నాయకులు,హుజురాబాద్ ప్రాంత నాయకులు.ఈ మేరకు శనివారం సచివాలయంలోని శ్రీధర్ బాబు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో,హుజురాబాద్ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేపించారు.సమస్యపై పూర్తిగా వివరించిన నాయకులు వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి తరలింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,హుజురాబాద్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పత్తి అనిత-కృష్ణారెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,జేఏసీ నాయకులు,కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు,హుజురాబాద్ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !