హుజూరాబాద్/ మే 11 (మా అక్షరం): తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ల బదిలీ ఉత్తర్వుల మేరకు హుజూరాబాద్ మున్సిపాలిటీకి కొత్త కమిషనర్గా బి. కిషన్ నియమితులయ్యారు. సోమవారం ఆయన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటివరకు కమిషనర్గా విధులు నిర్వహించిన ముసాబ్ అహ్మద్ సయ్యద్ను కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం, హైదరాబాద్కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నాయిని అశ్వినీ గాంధీ, సానిటరీ ఇన్స్పెక్టర్ ధరిపల్లి కిరణ్, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి. వినయ్తో పాటు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 138












