+91 99635 77856

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

హుజురాబాద్/ జులై 10 (మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి కణితి తొలగించారు. వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణిగుంట్ల కొమరమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. చికిత్స కోసం గత రెండు రోజుల క్రితం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. పరీక్షలన్ని నిర్వహించిన వైద్యులు కడుపులో కణతి ఉందని శస్త్ర చికిత్స అవసరమని తెలిపారు. దీంతో ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీకాంత్ రెడ్డి శస్త్ర చికిత్స చేసి సుమారు నాలుగు కిలోల బరువు గల కణతిని తొలగించారు. ప్రస్తుతం మహిళా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !