హుజరాబాద్/ జూన్ 25(మా అక్షరం): కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ పార్టీల నాయకుల సవాళ్లతో మంగళవారం చెల్పూర్ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఏం జరుగుతుందో అని ప్రజలు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేరా, ఇసుక మాఫియా, రైస్ మిల్లర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో మంగళవారం ఉదయం 11 గంటలకు చెల్పూర్ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వస్తున్నామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా డబ్బులు తీసుకోకపోతే అదే ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ప్రణవ్ సవాల్ విసరగా…. దానికి స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దానికి సిద్ధమే అంటూ… ప్రణవ్ బాబు 11 గంటలకు ఆలయానికి వస్తానంటే… కౌశిక్ రెడ్డి 10 గంటలకే చెల్పూర్ ఆలయానికి వస్తానని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు… దీంతో ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ వేడి ఎక్కిందని ప్రజలు చర్చించుకుంటున్నారు











