+91 99635 77856

ఆర్థిక సహాయం అందజేత…

హుజురాబాద్/జూలై 8(మా అక్షరం):మండలం లోని కాట్రపల్లి గ్రామంలో పలువురు అభాగ్యులకు తెలంగాణ పద్మశాలి సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం గ్రామంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న కోమటి రాజేశ్వరి,కోమటి కనకలక్ష్మి, సబ్బరి లక్ష్మిలకు ఒక్కొక్కరికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బూర మల్లేశం మాట్లాడుతూ.. పద్మశాలి కులస్తులందరినీ ఒకే సంఘం కిందకు తీసుకువచ్చి టీఆర్పీఎస్ ను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్, టీఆర్ఎస్ కన్వీనర్ ఆడిచర్ల శ్రీనివాస్, జిల్లా కో కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ మండల అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, టౌన్ కన్వీనర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్, వీణవంక పద్మశాలి సంఘం అధ్యక్షులు వడ్డేపల్లి రాజగోపాల్, కూరపాటి రామచంద్రం, శ్రీనివాస్, రమేష్, సత్య రాజ్యం, రామస్వామి, కుమారస్వామి, రాజమౌళి, విశ్వనాథం పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !