+91 99635 77856

ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాంపూర్ యువకుడు..

హుజూరాబాద్/సెప్టెంబర్11(మా అక్షరం): మండలం లోని రాంపూర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ ఎస్సైగా బుధవారం హైదరాబాదులోని తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేశాడు. ట్రైనింగ్ పూర్తి కావడంతో లక్ష్మణ్ కి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. వినాయక చవితి బందోబస్తు తర్వాత పోస్టింగ్ ఇస్తారని ఆయన అన్నారు. గతంలో కరీంనగర్ సిరిసిల్లలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన లక్ష్మణ్ కష్టపడి చదివి ఎస్సై గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నందున తల్లి అరుణ, బావ బూదారపు కుమారస్వామి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సైగా పదవి చేపట్టడంతో పట్టణంలోని పలువురు అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !