హుజురాబాద్/ సెప్టెంబర్ 26(మా అక్షరం): భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన తెలంగాణ పోరులో పాల్గొని తెలంగాణ మహిళల వీరత్వాన్ని ప్రపంచానికి చాటిన యోధురాలు చాకలి ఐలమ్మ అని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్ అన్నారు. గురువారం హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద 129 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నాటి దొరల గడీలకు దీటుగా ఆమె పోరాడింది అన్నారు. నేటి మహిళలు వీరనారి చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఐలమ్మ దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల- శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపాక శ్రీనివాస్, రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,పిఎసిఎస్ చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మాజీ సర్పంచ్ పంజాల రామ్ శంకర్ గౌడ్, కొలిపాక శంకర్,నల్ల బాలరాజు,వెంకటేశ్వర్లు,వేల్పుల ప్రభాకర్,వేల్పుల రత్నం,సదానందం, వెంకటస్వామి,కొలిపాక మహేష్, నల్ల సుమన్, పంజాల శ్రీధర్ గౌడ్, నల్ల రాజు,సుంకరి రాజమౌళి,కొల్లిపాక శ్రీనివాస్, సందీప్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.











