ఎల్కతుర్తి/ అక్టోబర్ 20(మా అక్షరం):మండల కేంద్రంలోని వల్లభాపూర్ గ్రామంలో వాటర్ ప్లాంట్ రీ ఓపెనింగ్ మరియు చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన పొన్నం అనూఫ్ గారికి స్వాగతం పలికిన వల్లభాపూర్ గ్రామస్తులు 3 నెల నుండి తాగునీటి సమస్యతో బాధపడుతున్న ప్రజల యొక్క కష్టాలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాజీ మండల అధ్యక్షులు సంతాజి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దృష్టికి తీసుకొని పోవడం వలన ఈ సమస్యపై స్పందించిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి లక్ష 96 వేల రూపాయలు విలువచేసే వాటర్ ప్లాంట్ మెటీరియల్ ఇప్పించడం జరిగింది గ్రామస్తులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దృష్టికి తీసుకు వెళ్లినటువంటి గౌరవనీయులు మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వల్లభాపూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కట్కూరి గౌతమ్ ఆధ్వర్యంలో జరిగినది కాంగ్రెస్ మండల నాయకులు వల్లభాపూర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు











