హుజురాబాద్/అక్టోబర్ 22 (మా అక్షరం): ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెన్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ, మండల కమిటీలను ఎన్నుకున్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్ టి ఐ (U/F) ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామి రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. హుజురాబాద్ టౌన్ కమిటీ కన్వీనర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్, కో కన్వీనర్ పశువుల స్వామి, పట్టణ సలహాదారులు కాగిత రాములు, మండల కమిటీ కన్వీనర్ బెల్లి సతీష్, కో కన్వీనర్ మొలుగురి మొగిలయ్య, మండల కమిటీ సలహాదారులు బండ లక్ష్మారెడ్డి ,నియోజకవర్గం కో కన్వీనర్ కేదాసి శ్రీధర్, నియోజకవర్గ కోకన్వీనర్ పోలెపాక విల్సన్, సలహాదారుల కంకణాల జనార్దన్ రెడ్డిలకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తులసి లక్ష్మణమూర్తి, సంధ్యాల వెంకన్న, గూడూరు చైతన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు











