+91 99635 77856

యువకుడి ఆత్మహత్య..

కరీంనగర్, మానకొండూరు/నవంబర్18(మా అక్షరం): మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన పడాల శ్రీధర్ గౌడ్ (37)అనే వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడగలను సోమవారం చోటు చేసుకుంది.గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… పడాల శ్రీధర్ గౌడ్ గ్రామంలో టెంట్ హౌస్ నడుపుతూ, కోంత పోలాన్ని కూడా కౌలుకు తీసుకుని జీవిస్తున్నాడు. ఇదేక్రమంలో పొలానికి పెట్టుబడికి, కుటుంబ పోషణకై అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక కుటుంబం గడవక వ్యవసాయ పోలాల వద్ద చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడి మృతి చెందాడు. మృతునికి భార్య,ఒక కుమారుడు, కూతురు ఉండగా విషయం విన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ ఇంచార్జీ సి.ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !