హుజురాబాద్/నవంబర్ 25(మా అక్షరం): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి స్వర్గీయ గుర్రం వెంకటేశ్వర్ల సంవత్సరికం సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆయన కు నివాళులు అర్పించారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో గుర్రం వెంకటేశ్వర్ల కుమారుడు హరిబాబు ను కలిసి వెంకటేశ్వర్లతో ఉన్న అను బంధాన్ని పంచుకున్నారు. టిడిపిలో రాష్ట్ర నాయకుడిగా తమతో కలిసి వెంకటేశ్వర్లు పనిచేశాడని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క వెంట హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ బాబు, పుష్పలత, శ్రీనివాస్ పలువురు నాయకులు ఉన్నారు.
Post Views: 48











