తిమ్మాపూర్ /జనవరి 10 (మా అక్షరం): మండలం కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా, ఉద్యోగ ప్రమాణాలను గుర్తించి నేషనల్ అసెస్మెంట్ ఆండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) సంస్థ కళాశాలకు “ఏ” గ్రేడ్ అవార్డు అందించింది.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ….ఈ అవార్డు తమ కాలేజీని మరింత సమర్ధవంతంగా, గురాత్మకంగా నడుపుటకు ప్రేరణనిస్తుందని,అంతేకాకుండా కళాశాల ఎన్బిఏ గుర్తింపుకు అటానమస్ కు కూడా అర్హత సాధిస్తుందని తెలియజేశారు. కళాశాల ఆధునిక సదుపాయాలను క్రీడా మైదానాలను విద్యార్థులకు అందిస్తున్నటువంటి నాణ్యమైన విద్య, ఉద్యోగ సదుపాయాలను పరిశీలించిన వివిధ కళాశాలల విద్యావేత్తలు కళాశాల చైర్మన్, ప్రిన్సిపల్ ను అభినందించారు.అనంతరం ప్రిన్సిపల్ డా. జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ……శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల 2004 నుండి గుణాత్మకంగా నడుస్తుందనడానికి ప్రతిఫలమే ఈ విజయమని, మునుముందు ఎన్బిఏ మరియు అటానమస్ పై దృష్టి సారించి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ కళాశాల నాణ్యతను మరింత పెంపొందిస్తామని హర్షం వ్యక్తంచేశారు.











