ఘనంగా నిర్వహించిన గౌడ కులస్తులు…
ఎల్కతుర్తి/ఆగస్టు 18 (మా అక్షరం):

మండలంలోని వీరనారయణపూర్ గ్రామంలో సోమవారం రోజున శ్రీ శ్రీ శ్రీ రేణుక ఏల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ కులస్తులు అందరూ కలిసి బహుజన విప్లవ వీరుడు, గోల్కొండ మహారాజ్, శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం చుట్టూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు, నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. బడుగులను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించిన సర్దార్ పాపన్నను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దొరలు, పెత్తందార్ల ఆదిపత్యానికి, అణచివేతకు ఎదురుండి పోరాడిన వీరుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిత్యం పరితపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండ వెంకటేశ్వర్లు గౌడ్, మండ సారంగం గౌడ్, మండ పోచయ్య గౌడ్, మండ తిరుపతి గౌడ్, మండ రాజయ్య గౌడ్, మండ భాస్కర్ గౌడ్, మండ ఆనందం గౌడ్, మండ సారంగం గౌడ్, మండ రాజ్ కుమార్ గౌడ్ తదితర గౌడ కుల భాందవులు పాల్గొన్నారు.











