తలసేమియా రోగుల కోసం దాతల చేయూత…
హుజురాబాద్/ సెప్టెంబర్ 03(మా అక్షరం):
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో సైదాపూర్ మండలం, లస్మన్నపల్లి గ్రామంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు ప్రముఖ దాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని దానాల కంటే రక్తదానమే గొప్పదని ఉద్ఘాటించారు. “ప్రతి ఒక్కరూ రక్తహీనతతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. మన రక్తం ఎవరికైనా ప్రాణదానం చేయగలదని పిలుపునిచ్చారు.
Post Views: 114











