+91 99635 77856

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు..

-ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు..

-సైదాపూర్ క్రాస్ రోడ్ లో తాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రణవ్…

– జయంతి వేడుకలకు భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు..

హుజూరాబాద్/ సెప్టెంబర్ 16 (మా అక్షరం): హుజురాబాద్ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా త్రాగునీటికి,విద్య పరంగా అనేక సేవలు రాజేశ్వర్ రావు అందజేశారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ వొడితల(సింగాపురం) రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు.సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.జయంతి సందర్భంగా వివిధ మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు,అభిమానులను ఆప్యాయంగా పలకరించారు.ఈ సందర్భంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.తాత ఆశయాలను కొనసాగిస్తూ,విద్య ఉద్యోగ కల్పనలో మొదటి స్థానంలో ఉంచుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !