-పెద్దమ్మతల్లి బోనాలకు హాజరైన ప్రణవ్…
– ఘన స్వాగతం పలికిన ముదిరాజ్ కులస్తులు…
– పెద్దమ్మతల్లి ఆశీర్వాదం వలన ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి…
హుజురాబాద్/ నవంబర్15( మా అక్షరం): పట్టణంలోని ముదిరాజు కులస్తులు ఘనంగా పెద్దమ్మతల్లి బోనాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.అమ్మవారి అభిషేక పూజలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… పెద్దమ్మతల్లి ఆశీర్వాదం వలన ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు.8రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఇంత గొప్పగా బోనాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.హుజురాబాద్ ప్రాంతం ఆధ్యాత్మికతకు,భక్తి శ్రద్ధలతో విరసిల్లాలని కోరుకున్నారు.ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని,దానికి తగ్గట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.











