-రిటైర్డ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరించిన మండలి చైర్మన్ గుత్తా…
హుజురాబాద్/ జనవరి 09 (మా అక్షరం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 2026 డైరీని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, హుజురాబాద్ యూనిట్ అధ్యక్షులు ఉస్మాన్ పాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దామోదర్ రెడ్డి, ఉస్మాన్ పాషా విలేకరులతో మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్న తమ విజ్ఞప్తి పట్ల అయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ సంఘం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.











